వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-02-21T23:38:23+05:30 IST
వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు న గరం గొడుగుపాలెంలో జరిగింది.
ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 21: వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు న గరం గొడుగుపాలెంలో జరిగింది. పోలీసుల కథ నం మేరకు.. నాగులుప్పలపాడు మండలం చవ టపాలెం గ్రామానికి చెందిన వెంకట్రావుకు, బాప ట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన ఆదిలక్ష్మి (37)కి ఇరవై సంవత్సరాల క్రి తం వివాహం జరిగింది. వారికి 11 ఏళ్ళ బాలుడు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం ఒంగోలు గొడుగుపాలెంలో నివాసం ఉంటూ ఇస్త్రీ బండి వేసుకొని జీవిస్తూ కుమారుడిని చదివించుకుంటున్నారు. ఆదిలక్ష్మి ఆ ప్రాంతంలో ఇళ్ళలో పనిచేసుకుంటుంది. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఆదిలక్ష్మి వంట గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ట్యూషన్ వెళ్లేందుకు కుమారుడు సాయిమణికంఠ నిద్ర లేచి తల్లి కోసం వంటగదిలోకి వెళ్లాడు. ఫ్యాన్ హుక్కుకు తల్లి వేలాడుతుండడం చూసి పెద్దగా కేక వేశాడు. దీంతో నిద్ర పోతున్న భర్త వెంకట్రావు వెంటనే లేచి చీర కోసి ఆమెను కిందకు దించగా అప్పటికే చనిపోయింది. దీంతో తండ్రీకొడుకులు ఒక్కసారిగా బోరున విలపించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనే వి షయం తెలియరాలేదు. మృతురాలి తల్లి అనసూయ వన్టౌన్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు.