వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు
ABN , First Publish Date - 2023-06-11T02:07:44+05:30 IST
మండలంలోని బ్రాహ్మ ణపల్లి పంచాయతీలోని యర్రపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రామస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యాక్రమాలను ఆ గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కొమరోలు, జూన్ 10: మండలంలోని బ్రాహ్మ ణపల్లి పంచాయతీలోని యర్రపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రామస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యాక్రమాలను ఆ గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉద యం స్మామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. కార్యాక్రమానికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.
కంభం : పట్టణంలోని శీలంవారి వీధిలో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయం లో నూతన విగ్రహా ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.