ఈతకు దిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-03-02T23:24:19+05:30 IST
మిత్రుడు ఇంట్లో జరుగు తున్న ఫంక్షన్కి హాజరై దగ్గరలో ఉన్న సాగర్ కా లువలో సరదాగా ఈత కొట్టేందుకు మిత్రులతో కలి సి దిగాడు. అయితే ఈత చేతకాకపోవటం, నీటి ప్ర వాహం వేగంగా ఉండటంతో యువకుడు గల్లంత య్యాడు.
ఒంగోలు బ్రాంచ్ కాలువలో ఘటన
చీమకుర్తి, మార్చి 2: మిత్రుడు ఇంట్లో జరుగు తున్న ఫంక్షన్కి హాజరై దగ్గరలో ఉన్న సాగర్ కా లువలో సరదాగా ఈత కొట్టేందుకు మిత్రులతో కలి సి దిగాడు. అయితే ఈత చేతకాకపోవటం, నీటి ప్ర వాహం వేగంగా ఉండటంతో యువకుడు గల్లంత య్యాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు కాలువలో వెదికించగా శవమై తేలాడు. చీమకుర్తి శివారునుం చి వెళ్తున్న ఒంగోలు బ్రాంచి సాగర్ కాలువలో గు రువారం జరిగిన సంఘటనలో ఒంగోలు పట్టణాని కి చెందిన యువకుడు చిన్నం మాధవ్(20) మృతి చెందాడు. ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న చెందిన దాదాపు పది మంది యువకులు చీమకుర్తి పట్టణానికి చెందిన సహమిత్రుడు ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి హా జరయ్యారు. అందరూ కలిసి దగ్గరలో ఉన్న ఒంగో లుబ్రాంచ్ సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ముగ్గురు కాలువలో ఈతకి దిగారు. ప్రవాహం ధా టికి ఈత సరిగ్గా రాని మాధవ్ గల్లంతయ్యాడు. మి త్రులు వెదికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆంజనే యులు సంఘటనాస్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో వెదులాడించారు. చివరికి మాధవ్ మృతదేహన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచా రణ జరుపుతున్నారు.