రిమ్స్‌ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2023-06-01T01:53:29+05:30 IST

ఒంగోలు రిమ్స్‌ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.

రిమ్స్‌ అభివృద్ధికి కృషి
బస్సును ప్రారంభిస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేని

ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేని

మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు బస్సు బహూకరణ

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 31 : ఒంగోలు రిమ్స్‌ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. రిమ్స్‌ విద్యార్థుల కోసం ఆయన బుధవారంబస్సును బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేనితో కలిసి మీడియాతోమాట్లాడారు. రిమ్స్‌ కాలేజీలో చదువుతున్న మెడిసిన్‌ విద్యార్థులు, అలాగే హౌస్‌సర్జన్లు వివిధ అధ్యయనాల కోసం పీహెచ్‌సీలకు వెళ్లాల్సి ఉన్నందున రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని సూచనతో ఎంపీ లాడ్స్‌ కేటాయించి బస్సును అందజేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన రిమ్స్‌ కాలేజీలో ఇంకాకొన్నిసమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ఎంపీ మాగుంట, తాను కలిసి మెడికల్‌ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జీజీహెచ్‌లోని రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌, రిమ్స్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ సాల్మన్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:53:29+05:30 IST