శిథిల భవనాన్ని కూల్చరా..?

ABN , First Publish Date - 2023-01-10T23:04:32+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి.

శిథిల భవనాన్ని కూల్చరా..?
శిథిలావస్థలో ఎమ్మార్సీ భవనం

పొంచివున్న ప్రమాదంపై ప్రజల ఆందోళన

దర్శి, జనవరి 10 : మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి. ఏ నిమిషంలోనైనా కూలే పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఎ నిమిదేళ్ల క్రితం అక్కడి నుంచి శిక్షణ కేంద్రం భవనంలోకి మారారు. అ ప్పటి నుంచి శిథిలమైన భవనం అలాగే ఉంచారు. అదే ప్రాంతంలో ఎంపీడీవో, వ్యవసాయ, గృహ నిర్మాణ, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు భవిత విద్యా కేంద్రం ఉన్నాయి. నిత్యం ప్రజలు తిరుగుతూ ఉం టారు. ఆ భవనం కూలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉం ది. భవనానికి నిర్మించిన తులపులు, కిటికీలు ఇతర సామగ్రి చెద లుపట్టి పోటుతున్నాయి. భవనాన్ని కూల్చేందుకు ఉన్నతాధికారుల అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ ఈ విషయం గూర్చి అధికారులు పట్టించుకోడం లేదు. ఏ నిమిషంలో నైనా కూలిపోయే భవనాన్ని తొలగించకుండా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-10T23:04:34+05:30 IST