నిరంతరం వైద్య సేవలు
ABN , First Publish Date - 2023-12-10T22:04:48+05:30 IST
కనిగిరి ప్రాంత ప్ర జలకు నిరంతరం కంటి వైద్య శిబిరాలతో పా టు వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్కు కంటి పరిక్షల కోసం వ చ్చిన వృద్ధులను డాక్టర్ పేరు, పేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధులు డాక్టర్ ఉగ్రకు చేతులెత్తి నమస్కరించారు. ఎంతో మంది పేదలకు కం టి చూపు దాతవయ్యావు, నీవు చల్లగా ఉండా లని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నా, లేకు న్నా కనిగిరి ప్రాంత ప్రజలకు నిరంతం పలు కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూనే ఉన్నానని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
ఉచిత కంటి వైద్య
శిబిరానికి విశేష స్పందన
కనిగిరి, డిసెంబరు 10 : కనిగిరి ప్రాంత ప్ర జలకు నిరంతరం కంటి వైద్య శిబిరాలతో పా టు వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్కు కంటి పరిక్షల కోసం వ చ్చిన వృద్ధులను డాక్టర్ పేరు, పేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధులు డాక్టర్ ఉగ్రకు చేతులెత్తి నమస్కరించారు. ఎంతో మంది పేదలకు కం టి చూపు దాతవయ్యావు, నీవు చల్లగా ఉండా లని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నా, లేకు న్నా కనిగిరి ప్రాంత ప్రజలకు నిరంతం పలు కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూనే ఉన్నానని అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టినందుకు తన కు చేతనైనంత సేవ, సహాయసహకారాలు అందిస్తానన్నారు. అందుకు భగవంతుడు త నకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని అ న్నారు. కంటి ఆపరేషన్ల కోసం గుంటూరు వెళ్లిన వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత తనదే అన్నారు.
విశేష స్పందన
కంటి సంబంధిత వ్యాధితో భాదపడుతున్న కనిగిరి ప్రాంత ప్రజలకు మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ ఉగ్ర ఆధ్వర్యంలో నిర్వహించే మెగా ఉ చిత కంటి వైద్య శిబిరానికి ఆదివారం విశేష స్పందన లభించింది. స్థానిక అమరావతి గ్రౌం డ్స్లో ఆదివారం మెగా ఉచిత కంటి వైద్య శి బిరం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచే కనిగిరి ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వృద్ధులు అమరావతి గ్రౌండ్స్ వద్దకు చేరుకున్నారు. ఈ శిబిరంలో 306మంది వృద్ధులకు గుం టూరు శంకర కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలను చేశారు. కంటి సంబంధిత సమస్యలతో ఉన్నవారిని పరీక్షిం చిన వైద్య నిపుణులు డాక్టర్ రూతూజపాటిల్, డాక్టర్ సోనాలిబెహ్రా అపరేషన్లకు గుర్తించారు. అపరేషన్కు 185మందికి అవసరంగా వైద్యులు నిర్ధారించారు. అపరేషన్కు ఎంపికైన వారిలో మొదటి విడతగా ఆదివారం 50మందిని గుం టూరు శంకర కంటి ఆసుపత్రికి ప్రత్యేక వాహనాల్లో తరలించే ఏర్పాట్లను డాక్టర్ ఉగ్ర కల్పిం చారు. రెండో విడత ఈనెల 12న 60మందిని, 13వ తేదీన 65మందిని ప్రత్యేక వాహనాల్లో గుంటూరు ఆసుపత్రికి తరలించనున్నట్లు డా క్టర్ ఉగ్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. కంటి వైద్య శిబిరంలో టీడీపీ శ్రేణులు, నాయకులు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించారు. ఐటీడీపీ కోఆర్డినేటర్లు మార్నేని రామకృష్ణ, రమాదేవి, మువ్వా ుు, కూడలి రోశయ్య, నారపరెడ్డి వెంకటరెడ్డి, ఖాజా, హనుమంతరావు, నజిముద్దీన్, జంషీర్, కాశయ్య, నాగరాజు, రాజా, బ్రహ్మయ్య, మ హేంద్రలు వలంటీర్లు వివిధ సేవలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.