పోలింగ్ కేంద్రాల మార్పులను విరమించుకోవాలి
ABN , First Publish Date - 2023-09-19T23:38:01+05:30 IST
నాగులుప్పల పాడు మండలంలోని మూడు గ్రా మాల్లోని పోలింగ్ కేంద్రాలను మా ర్చవద్దని, యథాతధంగా ఉంచాలని టీడీపీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్కుమార్ కోరారు. ఈమేరకు మండల టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఒంగోలులో కలెక్టర్ దినేష్ కుమార్కు వినతిపత్రం అందజేశా రు.

కలెక్టర్కు టీడీపీ నాయకుల వినతి
నాగులుప్పలపాడు(ఒంగోలురూ రల్), సెప్టెంబరు 19: నాగులుప్పల పాడు మండలంలోని మూడు గ్రా మాల్లోని పోలింగ్ కేంద్రాలను మా ర్చవద్దని, యథాతధంగా ఉంచాలని టీడీపీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్కుమార్ కోరారు. ఈమేరకు మండల టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఒంగోలులో కలెక్టర్ దినేష్ కుమార్కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా మనోజ్కుమార్ మాట్లాడుతూ చదలవాడలో 197 ఎన్నికల పోలింగ్ కేంద్రం తరలించడం వల్ల గ్రామస్తులు ఇబ్బందిపడతారని, ఈ కేంద్రం పరిధిలో 800ఓట్లు ఉండగా 250 ఓ ట్లు మాత్రమే కేశినేనివారిపాలెంలో ఉన్నాయని, మిగతా 650 ఓట్లు చదలవాడలో ఉన్నట్లు చెప్పారు. మద్దిరాలపాడులో రెండు పోలింగ్ కేంద్రాలు విశాలంగా ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని, ఎస్పీకాలనీలోని పాఠశాలకు 198 ఎన్నికల పోలింగ్ మార్పు చేయటం తగదన్నారు. ఎస్సీకాలనీ లో గత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో గొడవలు జరిగాయని, ఈక్రమంలో హైస్కూల్లోనే పోలింగ్ కేంద్రానిన కొనసాగించాలని చెప్పారు. మద్దిరాలముప్పాళ్ల గ్రామ పంచాయతీలో ముప్పాళ్ల, మద్దిరాల రెండు గ్రామాలని, అందువల్ల మ ద్దిరాలలో గల పోలింగ్కేంద్రాన్ని ముప్పాళ్లకు మార్పు చేయవద్దన్నారు. మద్దిరాల లో 600ఓట్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణ్ కిషోర్బాబు తదితరు లు పాల్గొన్నారు. అలాగే నాగులుప్పలపాడు తహసీల్దార్కు కూడా వారు మరో వినతిపత్రం సమర్పించారు.