హౌసింగ్ లబ్ధిదారుల కోసం కాల్సెంటర్ !
ABN , First Publish Date - 2023-06-07T00:11:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న జగనన్న కాలనీల్లోని పక్కా గృహాల నిర్మాణాల వేగవంతానికి చ ర్యలు చేపట్టింది. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పక్కా గృహాల నిర్మాణాల ను వేగవంతంగా చేపట్టేందుకు ఎప్ప టికప్పడు లబ్ధిదారులకు తగిన సలహా లు, పరిష్కార మార్గాలను చూపించనున్నారు
ఒంగోలు(నగరం), జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న జగనన్న కాలనీల్లోని పక్కా గృహాల నిర్మాణాల వేగవంతానికి చ ర్యలు చేపట్టింది. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పక్కా గృహాల నిర్మాణాల ను వేగవంతంగా చేపట్టేందుకు ఎప్ప టికప్పడు లబ్ధిదారులకు తగిన సలహా లు, పరిష్కార మార్గాలను చూపించనున్నారు. ఇందుకోసం ఒంగోలులోని జిల్లా గృహనిర్మాణశాఖ కార్యాలయంలో బుధవారం నుంచి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 7093930922 నంబరుతో ఈకాల్ సెంటర్ పనిచేయనుంది. జిల్లాలో పక్కాగృహాలు మంజూరైన లబ్ధిదారులు గృ హనిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ కాల్సెంటర్ ద్వారా తెలియచే యవచ్చు. పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. లబ్దిదారుల నుంచి వచ్చేకా ల్స్ను సేకరించి నమోదు చేసేందుకు సిబ్బందిని నియమించారు. ఇంటి నిర్మా ణంలో ఎదురవుతున్న ఇబ్బందులను కాల్సెంటర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా హౌసింగ్ ప్రధాన అధికారి ఇ.పేరయ్య తెలిపారు.