ఉత్తమ బోధన అందించాలి
ABN , First Publish Date - 2023-10-30T22:08:18+05:30 IST
విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. మండలంలోని తూర్పుచౌటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల పనితీరును సోమవారం ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా కానుక పథకం అందిందా లేదా తెలుసుకున్నారు.
దర్శి, అక్టోబరు 30 : విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. మండలంలోని తూర్పుచౌటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల పనితీరును సోమవారం ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా కానుక పథకం అందిందా లేదా తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని వెంకాయమ్మ అడగ్గా బస్సు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. వెంటనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేస్తామని జడ్పీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవోలు రఘురామయ్య, రమాదేవి, హెచ్ఎం రామణయ్య పాల్గొన్నారు.