టీడీపీ ఫ్లెక్సీని చించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-01-18T00:28:07+05:30 IST
ఒంగో లులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ ని చించేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డి మాండ్ చేశారు. స్థానిక రాజపానగల్రోడ్లో స్థా నిక టీడీపీ నాయకులు పెద్దిశెట్టి చంద్ర, వరల క్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే దామచర్ల జనార్దన్, సతీమణి నాగసత్య లత ఫొటోలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలి యజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తెలుగు తమ్ముళ్ల డిమాండ్
పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు(కార్పొరేషన్), జనవరి 17 : ఒంగో లులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ ని చించేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డి మాండ్ చేశారు. స్థానిక రాజపానగల్రోడ్లో స్థా నిక టీడీపీ నాయకులు పెద్దిశెట్టి చంద్ర, వరల క్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే దామచర్ల జనార్దన్, సతీమణి నాగసత్య లత ఫొటోలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలి యజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోమవారం కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం ఉం డటంతో తమ నాయకుడుకు శుభాకాంక్షలు తె లియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని చించివేశారు. దీంతో మంగళవారం తెలుగు తమ్ముళ్లు ఆ ప్రా ంతానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి చెం దిన కొందరు వ్యక్తులు కావాలనే తమ ఫ్లెక్సీని చించివేశారని ఆరోపించారు. అందుకు బాధ్యులై న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే శారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు క్ష మాపణ చెప్పాలన్నారు. అనంతరం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమం లో పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.