20 కుటుంబాలు టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2023-06-01T00:00:20+05:30 IST
తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు మీనిగ రామిరెడ్డి, ముత్తుముల రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు తెలుగుదేశం పార్టీలో చేరారు.
గిద్దలూరు, మే 31 : తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు మీనిగ రామిరెడ్డి, ముత్తుముల రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరూ గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మీనిగ రామచంద్రరెడ్డి, రమణరెడ్డి, నారాయణరెడ్డి, శివరంగారెడ్డి, స్వామిరంగారెడ్డి, కైపా వెంకట రామిరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కటికె యోగానంద్, ఎస్సీసెల్ అధ్యక్షుడు గుర్రం దానియేలు, రైతు సంఘం అధ్యక్షుడు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ ఉల్లాఖాన్, టీడీపీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసులు, యామా సంజయ్, దప్పిలి కాశిరెడ్డి, శిరిగిరి వెంకటపతి, సొంటం కల్యాణ్రెడ్డి ఉన్నారు.