Pattabhi: పట్టాభిరాం సతీమణి చందనను పరామర్శించిన పీతల సుజాత

ABN , First Publish Date - 2023-02-22T20:12:03+05:30 IST

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) సతీమణి చందనను మాజీమంత్రి పీతల సుజాత (Peethala Sujatha) పరామర్శించారు.

Pattabhi: పట్టాభిరాం సతీమణి చందనను పరామర్శించిన పీతల సుజాత

గుంటూరు: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) సతీమణి చందనను మాజీమంత్రి పీతల సుజాత (Peethala Sujatha) పరామర్శించారు. అనంతరం సుజాత మీడియాతో మాట్లాడుతూ ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ (YCP) ప్రభుత్వంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రజాస్వామ్యం అంతరించిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి చేసి కార్లు దగ్ధం చేస్తున్నా... పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరాం, దొంతు చిన్నా మరియు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అన్యాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చూసి సీఎం జగన్ (CM Jagan) భయపడి ఇలాంటి దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులకు వెనుకడుగు వేయకుండా రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తామని సుజాత స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-22T21:29:30+05:30 IST