NTR : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ABN , First Publish Date - 2023-08-28T11:36:05+05:30 IST

రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

NTR : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి (Daggubati Purandeshwari), దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ (Actor Balakrishna), నారా బ్రాహ్మణి (Nara Brahmini), ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు (NTR Family) పాల్గొన్నారు.

అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, బాలకృష్ణ, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.

Untitled-7.jpg

Updated Date - 2023-08-28T11:46:39+05:30 IST