వరల్డ్‌ వాటర్‌డేపై అవగాహన

ABN , First Publish Date - 2023-03-18T22:29:35+05:30 IST

ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టి, నీటిని పొదుపుగా వాడాలని సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌. విజయ్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ వాటర్‌డే సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ

    వరల్డ్‌ వాటర్‌డేపై అవగాహన
18కెడికె1 : మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌జడ్జి విజయ్‌బాబు

కందుకూరు, మార్చి 18: ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టి, నీటిని పొదుపుగా వాడాలని సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌. విజయ్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ వాటర్‌డే సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షపునీరు ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌, ఏజీపీ కే హరికోటేశ్వరరావు, మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పవన్‌కుమార్‌, అడ్వకేట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:29:35+05:30 IST