టిప్పర్ బోల్తా : తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2023-02-23T21:10:15+05:30 IST
మండల పరిధిలోని ఉడ్హౌస్పేట క్రాస్ రోడ్డు వద్ద గురువారం టిప్పర్ ముందు టైర్ల మధ్య రాడ్డు విరిగిపోయి అదుపుతప్పి పక్కనున్న ఊట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సంగం నుంచి బుచ్చి
సంగం, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని ఉడ్హౌస్పేట క్రాస్ రోడ్డు వద్ద గురువారం టిప్పర్ ముందు టైర్ల మధ్య రాడ్డు విరిగిపోయి అదుపుతప్పి పక్కనున్న ఊట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సంగం నుంచి బుచ్చి వైపు గ్రావెల్ లోడుతో టిప్పర్ వెళ్తుండగా ఉడ్హౌస్పేట క్రాస్ రోడ్డు వద్ద ముందు టైర్ల మధ్య ఉండే ఇనుపరాడ్డు విరిగి అదుపుతప్పి పక్కనే ఉన్న ఊటకాలువలో బోల్తాపడింది. అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు, ఆ వెనుకనే సిమెంట్ ట్యాంకర్ వస్తున్నాయి. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా చోటకు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.