లక్ష్మీ గణపతికి వెండి మకరతోరణం, కవచం బహూకరణ

ABN , First Publish Date - 2023-02-05T22:57:50+05:30 IST

మండలంలోని జొన్నవాడ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంగం మండలం అమరప్ప నాయుడు కండ్రిగకు చెందిన మాలెపాటి చిట్టిబాబు దంపతులు ఆదివారం 1.557 కిలోల వెండి కవచం, 1.453 కిలోల వెండి మకరతోరణం బహూకరించారు.

లక్ష్మీ గణపతికి వెండి మకరతోరణం, కవచం బహూకరణ
ఆలయ చైర్మెన్‌, ఏసీలకు వెండి మకరతోరణం అందజేస్తున్న దాతలు

4బీఆర్‌పీ5,

బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 5: మండలంలోని జొన్నవాడ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంగం మండలం అమరప్ప నాయుడు కండ్రిగకు చెందిన మాలెపాటి చిట్టిబాబు దంపతులు ఆదివారం 1.557 కిలోల వెండి కవచం, 1.453 కిలోల వెండి మకరతోరణం బహూకరించారు. అలాగే అన్నదాన సత్రానికి రూ. 33,001 విరాళంగా అందజేశారు. నెల్లూరు రామ్మూర్తినగర్‌కు చెందిన వేమిరెడ్డి సనత్‌కుమార్‌రెడ్డి అమ్మవారికి 3.550 గ్రాముల బంగారు ముక్కుపుడకను బహూకరించినట్టు ఆయల చైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఏసీ జే. వెంకటసుబ్బయ్య తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు వెండి తొడుగు, మకరతోరణానికి సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు శేషవస్ర్తాలు, ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మెన్‌, ఏసీలకు దాతలు బంగారు, వెండి ఆభరణాలను అందజేసి రసీదులు పొందారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తిరువాయిపాటి నందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

1, 2బీఆర్‌పీ5, జొన్నవాడ వద్ద లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్న లారీ

Updated Date - 2023-02-05T22:58:30+05:30 IST