బావిలో వ్యక్తి మృతదేహం గుర్తింపు
ABN , First Publish Date - 2023-03-25T22:56:20+05:30 IST
కావలి ముసునూరు జాతీయ రహదారి సమీపంలోని వ్యవసాయ బావిలో శనివారం మందా ఎర్రయ్య(48) మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి, రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసుల కథనం మేరకు, ముసునూరు దళితవాడకు చెందిన ఎర్రయ్య మతిస్థిమితం కోల్పోవటం తో నెల్లూరులో చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉం
కావలి రూరల్, మార్చి25: కావలి ముసునూరు జాతీయ రహదారి సమీపంలోని వ్యవసాయ బావిలో శనివారం మందా ఎర్రయ్య(48) మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి, రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసుల కథనం మేరకు, ముసునూరు దళితవాడకు చెందిన ఎర్రయ్య మతిస్థిమితం కోల్పోవటం తో నెల్లూరులో చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉంటూ మందులు వాడుతున్నాడు. ఈనెల 22వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎర్రయ్య తిరిగి రాకపోవటంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఈ క్రమంలో జాతీయ రహదారి సమీపంలోని వ్యవసాయ బావిలో నీటిపై ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా ఎర్రయ్యగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ తిరుమలరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.
-----------