ఆటో బోల్తా : పెయింటర్‌ మృతి

ABN , First Publish Date - 2023-05-31T21:42:52+05:30 IST

స్ధానిక ఇనమడుగు రోడ్డు కూడలిలో బుధవారం ఆటోబోల్తా పడటంతో ఓ పెయింటరు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన మర్లపాటి వెంకటేశ్వర్లు (70) విడవలూరు మండలం ముదివర్తిలోని అల్లుడి ఇంటి నుంచి నెల్లూ

 ఆటో బోల్తా  : పెయింటర్‌ మృతి
31 కేవీఆర్‌2: వెంకటేశ్వర్లు మృతదేహం

మరో ఇద్దరికి స్వల్పగాయాలు

కోవూరు, మే31: స్ధానిక ఇనమడుగు రోడ్డు కూడలిలో బుధవారం ఆటోబోల్తా పడటంతో ఓ పెయింటరు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన మర్లపాటి వెంకటేశ్వర్లు (70) విడవలూరు మండలం ముదివర్తిలోని అల్లుడి ఇంటి నుంచి నెల్లూరులో పెయింటింగు పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ముదివర్తి నుంచి ఆటోలో బయలుదేరిన ఆటో ఇనమడుగు రోడ్డు కూడలికి చేరుకునే సమయంలో బోల్తాపడింది. పెయింటరు వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్‌ఐ రమ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2023-05-31T21:42:52+05:30 IST