16 నుంచి మానసాదేవి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2023-05-31T21:46:08+05:30 IST
మండలంలోని తూర్పురొంపిదొడ్లలో వెలసి ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 16వ తేది నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చల్లా. తిరుపతయ్య అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా
వరికుంటపాడు, మే 31: మండలంలోని తూర్పురొంపిదొడ్లలో వెలసి ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 16వ తేది నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చల్లా. తిరుపతయ్య అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9వ వార్షికోత్సవం సందర్భంగా చల్లా వంశస్ధుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఫ్లెక్సీలతో పాటు గోపత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ సీటీ నాయుడు, అర్చకులు ప్రవీణ్శర్మ తదితరులు పాల్గొన్నారు.