Delhi Liquor Scam: నా కుమారుడు ఏ తప్పు చేయలేదు.. క్లీన్‌గా బయటకు వస్తాడు: మాగుంట

ABN , First Publish Date - 2023-02-24T20:09:27+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam)లో తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) స్పష్టం చేశారు.

Delhi Liquor Scam: నా కుమారుడు ఏ తప్పు చేయలేదు.. క్లీన్‌గా బయటకు వస్తాడు: మాగుంట

ఒంగోలు: ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam)లో తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) స్పష్టం చేశారు. మాగుంట కుటుంబం గత 70ఏళ్ల నుంచి ఎటువంటి మచ్చ లేకుండా వ్యాపారం చేస్తుందన్నారు. తమ వ్యాపారం పది రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, ఎప్పుడు ఎలాంటి తప్పు చేయదని ఆయన తెలిపారు. తాము వ్యాపారాన్ని నిబద్ధతతో చేస్తున్నాని తెలిపారు. తన కుమారుడు క్లీన్‌గా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు రాఘవరెడ్డి (Raghava Reddy)ని కోర్టులో కలిసినప్పుడు పెద్దనాన్న సుబ్బరామరెడ్డి పేరును ఎప్పుడు అప్రతిష్టపాలు చేయనని, కుటుంబానికి తలవంపులు వచ్చే పనిచేయనని చెప్పాడని వివరించారు. తన కుమారుడిపై తనకు నమ్మకం ఉందన్నారు. తన కుమారుడు తప్పు చేయనందునే తాను ధైర్యంగా ఉన్నానని మాగుంట పేర్కొన్నారు. ప్రజానీకం మాగుంట కుటుంబాన్ని, రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. సమస్యలన్నీ వెంటనే తీరిపోయేలా చూడమని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మాగుంట తెలిపారు. రాఘవరెడ్డి అంశం కోర్టులో ఉన్నందున ఎక్కువగా తానేమి మాట్లాడలేని తెలిపారు. త్వరలో నిజనిజాలు ప్రజల ముందు ఉంచుతానని మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు.

Updated Date - 2023-02-24T20:09:28+05:30 IST