Gorantla Buchaiah: ప్రజాగళంగా లోకేష్ యువగళం
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:40 PM
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
రాజమండ్రి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Buchaiah Chowdary) అన్నారు. సోమవారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ యువగళం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగిందన్నారు. లోకేష్ పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు. లోకేష్ బహిరంగ సభకు వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ బహిరంగ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.