Share News

Roja: జగనన్న సీఎం అయ్యాక స్పోర్ట్స్‌కు మంచి రోజులు వచ్చాయ్

ABN , First Publish Date - 2023-10-20T16:04:42+05:30 IST

19 ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సాధించిన విన్నర్‌లు ఈరోజు(శుక్రవారం) సీఎం జగన్‌ను కలిశారని మంత్రి రోజా తెలిపారు.

Roja: జగనన్న సీఎం అయ్యాక స్పోర్ట్స్‌కు మంచి రోజులు వచ్చాయ్

అమరావతి: 19 ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సాధించిన విన్నర్‌లు ఈరోజు(శుక్రవారం) సీఎం జగన్‌ను (CM Jagan) కలిశారని మంత్రి రోజా (Minister Roja) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మెదటి సారి భారత దేశానికి ఈ క్రీడాపోటీల్లో 107 మెడల్స్ వచ్చాయని.. ఏపీ నుంచి 13 మంది రిప్రజెంట్ చేస్తే 8మందికి మెడల్స్ వచ్చాయన్నారు. మెడల్స్ సాధించిన ప్లేయర్లకు నాలుగుకోట్ల 29 లక్షల రూపాయలు రిలీజ్ చేశామన్నారు. జగన్ చెస్ చాలా బాగా ఆడుతారని... అందుకే కోనేరు హంపిని చూశాకా చెస్ గేమ్‌ను కూడా విస్తృతంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా పిల్లల్లోని ట్యాలెంట్‌ను బయటకు తీసుకువస్తామన్నారు. జగనన్న సీఎం అయ్యాక స్పోర్ట్స్‌కు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వరుస మెడల్స్ వివిధ క్రీడల్లో లభిస్తున్నాయని మంత్రి రోజా పేర్కొన్నారు.

Updated Date - 2023-10-20T16:04:42+05:30 IST