మంత్రి విశ్వరూప్‌తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

ABN , First Publish Date - 2023-01-13T17:57:59+05:30 IST

మంత్రి విశ్వరూప్‌ (Vishwaroop)తో ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కోడిపందేలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్పీపై వైసీపీ...

మంత్రి విశ్వరూప్‌తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

కోనసీమ: మంత్రి విశ్వరూప్‌ (Vishwaroop)తో ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కోడిపందేలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్పీపై వైసీపీ (YCP) ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిపందేల విషయంలో ఎస్పీ ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, (Rapaka Varaprasad) తోట త్రిమూర్తులు తెలిపారు. కోనసీమలో కోడిపందేలు తరతరాలుగా వస్తున్న ఆచారమని రాపాక, తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో కోడిపందేలు, గుండాటలు అన్నీ ఉంటాయని, కోనసీమలో తప్ప అన్ని చోట్లా పందేలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల సంతోషం కోసం ఆంక్షలను లెక్కచేయమని రాపాక, తోట త్రిమూర్తులు తేల్చిచెప్పారు. కోనసీమలోని సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సంప్రదాయం ప్రకారం జరగాల్సినవన్నీ జరుగుతాయని రాపాక, తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-13T17:58:01+05:30 IST