12లోపు పనులు పూర్తి చేయాలి: డీఈవో
ABN , First Publish Date - 2023-06-04T00:10:52+05:30 IST
ప్రభుత్వం నాడు-నేడు పథకం రెండో విడత పనులను ఈ నెల 12వ తేదీలోపుల నాణ్యతగా పూర్తి చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో అనూరాధ అన్నారు.
బేతంచెర్ల, జూన్ 3: ప్రభుత్వం నాడు-నేడు పథకం రెండో విడత పనులను ఈ నెల 12వ తేదీలోపుల నాణ్యతగా పూర్తి చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో అనూరాధ అన్నారు. శనివారం బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారిశాలలో మండల విద్యాధికారి సోమశేఖర్ అధ్యక్షతన డోన్ డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. డీఈవో అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు రెండో విడత కింద 952 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఫేస్ యాప్ను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆమె సూచించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్ విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో లలిత కుమారి, డోన్ డివిజన్ స్థాయిలోని అవుకు, ప్యాపిలి, కోవెలకుంట్ల మండల విద్యాధికారులు శ్రీధర్, శ్రీనివాసులరెడ్డి, తిమ్మారెడ్డి, ఏపీవో రామ్మోహన్, హెచ్ఎంలు ఉన్నారు.