వైసీపీ నేత దౌర్జన్యం ..

ABN , First Publish Date - 2023-07-13T23:47:52+05:30 IST

పత్తికొండ పట్టణంలో గురువారం స్థల వివాదంలో తమపై వైసీపీ నేత దాడి చేశారంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

వైసీపీ నేత దౌర్జన్యం ..

స్థల వివాదంలో పోలీసులను ఆశ్రయించిన బాధితులు

పత్తికొండ టౌన్‌, జూలై 13: పత్తికొండ పట్టణంలో గురువారం స్థల వివాదంలో తమపై వైసీపీ నేత దాడి చేశారంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పట్టణంలోని బొగ్గుల చావిడి సమీపంలో ఓ ఇంటి దగ్గర కొద్ది రోజులుగా స్థల వివాదం నడుస్తోంది. అయితే బాధితులు సుంకన్న, మనోహర్‌ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న సమయంలో పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు నూర్‌బాషా తన అనుచరులతో వచ్చి ఈ స్థలం తనదని దౌర్జన్యానికి దిగాడని బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సంఘటనపై సీఐ మురళీమోహన్‌రెడ్డిని వివరణ కోరగా.. ఇరువర్గాల వారు ఫిర్యాదు చేశారని, అయితే వారు రాజీ పడ్డారని వివరించారు. నకిలీ డాక్యుమెంట్లు చూపించి స్థలం తనదని వైసీపీ నాయకుడు నూర్‌బాషా తనపై దాడి చేయడం అన్యాయమని, రిజిస్ట్రేషన్‌ పత్రాలు తమకే ఉన్నాయంటూ బాధితులు విలేఖర్లకు తెలిపారు.

Updated Date - 2023-07-13T23:47:52+05:30 IST