నంది నాటక పోటీలకు రెండు పద్య నాటకాలు
ABN , First Publish Date - 2023-09-20T00:32:18+05:30 IST
రంగస్థల కళాకా రులు ప్రతిష్టాత్మకంగా భావించే ‘నంది’ నా టక పోటీలకు కర్నూ లు నుంచి రెండు పౌరాణిక పద్య నాటకాలు ఎంపికయ్యాయి.

కర్నూలు కళాకారులకు రాష్ట్ర స్థాయిలో అవకాశం
కర్నూలు (కల్చ రల్), సెప్టెంబరు 19: రంగస్థల కళాకా రులు ప్రతిష్టాత్మకంగా భావించే ‘నంది’ నా టక పోటీలకు కర్నూ లు నుంచి రెండు పౌరాణిక పద్య నాటకాలు ఎంపికయ్యాయి. గురు వారం నంది నాటక పోటీల్లో ఎంపికైన నాటకాల జాబితాను రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి వెల్లడించినట్లు ఎంపికైన నాట కాల దర్శకులు పత్తి ఓబులయ్య, వీవీ రమణారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆ సంస్థ కళాకారుల తో రూపొందించిన ‘శ్రీకృష్ణ కమలపాలిక’ పౌరాణిక పద్య నాటకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బహుమతులు దక్కించుకుంది. సినీ నాటక రచయిత పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించిన ఈ నాటకానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షు డు పత్తి ఓబులయ్య దర్శకత్వం వహిస్తున్నారు. మహ్మద్ మియా, శ్రీనివా సరెడ్డి, రాజారత్నం తదితరులు నటిస్తున్నారు. అలాగే కర్నూలు కళాకా రుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వీవీ రమణారెడ్డి దర్శకత్వంలో రూపొం దించిన ‘ఆనందనిలయం’ నాటకాన్ని కూడా పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రాశా రు. శ్రీ వేంకటేశ్వరుడిపై రాసిన ఈ పద్య నాటకంలో సీనియర్ నటులు టి.రా జశేఖర్, పి. భాస్కర్, బిక్కి కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, కే రామ కృష్ణ, పి.షేక్షావలి, ఎంఆర్ రాధిక, ఆర్ శారదాబాయి, దేవసేన, లక్ష్మన్న నటిస్తున్నారు.