కార్పొరేషన్లో ఇద్దరు ఏఈలు బదిలీ
ABN , First Publish Date - 2023-06-03T00:47:22+05:30 IST
నగర పాలక సంస్థ పరిధిలో ఇద్దరు ఏఈలను బదిలీ చేస్తూ ఈఎన్సీ ఆనందరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు(న్యూసిటీ), జూన్ 2: నగర పాలక సంస్థ పరిధిలో ఇద్దరు ఏఈలను బదిలీ చేస్తూ ఈఎన్సీ ఆనందరావు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులో పని చేస్తున్న ఏఈ డీవీ కృష్ణలత నందికొట్కూరుకు, నందికొ ట్కూరులో పని చేస్తున్న భానుప్రతాప్ కర్నూలుకు, అలాగే కర్నూలులో పని చేస్తున్న హిమబిందును నంద్యాల మున్సిపాలిటీకి, ఎమ్మిగనూరులో పని చేస్తున్న ప్రవీణ్కుమార్ను కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు డీఈ రాధాకృష్ణను కూడా బదిలీ చేశారు.