రామలింగేశ్వరనగర్లో చోరీ
ABN , First Publish Date - 2023-05-31T23:58:37+05:30 IST
నాలుగో పట్టణ పోలీ్సస్టేషన్ పరిధిలో రామలింగేశ్వర్ నగర్లో శివకుమార్ గౌడు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది.
కర్నూలు, మే 31: నాలుగో పట్టణ పోలీ్సస్టేషన్ పరిధిలో రామలింగేశ్వర్ నగర్లో శివకుమార్ గౌడు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. శివకుమారు కడుమూరు పీహెచ్సీలో డాక్టరుగా పని చేస్తున్నారు. ఈయన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మంగళవారం సాయంత్రం భార్యతో కలిసి తన తల్లిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే ఇంట్లో ఉన్న టీవీ కింద పడిపోయింది. బీరువాలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్రూం వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్ తొలగించారు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం పోలీసులు, క్లూస్ టీమ్ ఆయన ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. 9 తులాల బంగారం చోరీకి గురైందని బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇదే కాలనీలో శ్రీనివాసులు అనే ఆర్మీకి చెందిన వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు తెలిసింది. ఈయన నెల రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి తాళం తీసి చోరీ చేసినట్లుగా సమాచారం. అయితే.. బాధితుడు వచ్చాక గానీ పూర్తి వివరాలు తెలుస్తాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.