అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-02-06T23:32:20+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు.
--కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు. సోమవారం యూనియన అధ్యక్షురాలు రేణుక అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో అంగనవాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగనవాడీలపై విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. వర్కర్ల పర్యవేక్షణ పేరుతో ఇప్పటికే ఐసీడీఎస్ పీడీ, సీడీపీఓలు, సూపర్వైజర్లు ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓల పర్యవేక్షణ కిందికి తీసుకురావడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్. రాధాక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి ఎండీ. అంజిబాబు, యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, నాయకులు శోభ, గోవర్థనమ్మ, సుభాషిని, ఎలిషా తదితరులు పాల్గొన్నారు.