యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

ABN , First Publish Date - 2023-01-26T00:08:36+05:30 IST

యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు.

యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

ఫ 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోండి

ఫ కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 25: యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువతకే ఉందన్నారు. మన భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు కోసం ప్రతి భారతీయుడు నమోదు చేసుకోవడం కోసం సమ్మరీ రివిజన కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు గతంలో జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారికి ఓటు నమోదుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు సంవత్సరంలో నాలుగుసార్లు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో నాసరరెడ్డి, సెట్కూరు సీఈవో పి.వి.రమణ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:08:37+05:30 IST