ప్రశాంతంగా పది పరీక్షలు
ABN , First Publish Date - 2023-06-02T23:48:27+05:30 IST
జిల్లాలో శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
1,323 మంది విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు(ఎడ్యుకేషన్), జూన్ 2: జిల్లాలో శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 3,500 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,323 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఈవో రంగారెడ్డితోపాటు మరో మూడు ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.