‘వచ్చేది టీడీపీ ప్రభుత్వమే’
ABN , Publish Date - Dec 31 , 2023 | 10:59 PM
కొత్త ఏడాదిలో జరిగే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ అన్నారు.
డోన్, డిసెంబరు 31: కొత్త ఏడాదిలో జరిగే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని గ్రాండ్ పవర్ ప్లే ఆవరణలో టీడీపీ ఎన్నికల సాంగ్ను విడుదల చేశారు. వలసల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలన చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీఎం శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు, శ్రీనివాసులు యాదవ్, ప్రజావైద్యశాల మల్లికార్జున, ధర్మవరం చిన్న నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డి, భరత్ రెడ్డి, అభిరెడ్డిపల్లె గోవింద్, జయన్న యాదవ్, మధుసూదన్గౌడు, సర్పంచ్ రామిరెడ్డి, చక్రపాణిగౌడు, కుమ్మరి సుధాకర్, ఎస్ఎండీ రఫీ, న్యాయవాది కృష్ణప్రసాద్, శ్రీరాములు పాల్గొన్నారు.