‘మానసిక వికాసానికి వేదికగా వేసవి శిక్షణ శిబిరాలు’

ABN , First Publish Date - 2023-05-31T23:59:46+05:30 IST

బాలల్లో మానసిక వికాసా నికి వేదికగా వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని విశ్రాంత ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) మేనే జర్‌ చంద్రశేఖరప్ప అన్నారు.

‘మానసిక వికాసానికి వేదికగా వేసవి శిక్షణ శిబిరాలు’

కర్నూలు(కల్చరల్‌), మే 31: బాలల్లో మానసిక వికాసా నికి వేదికగా వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని విశ్రాంత ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) మేనే జర్‌ చంద్రశేఖరప్ప అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో గత నెల రోజులుగా కొనసాగిన బాలల వేసవి శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన చంద్ర శేఖరప్ప మాట్లాడుతూ చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా నాట్యం, చిత్రలేఖనం, గాత్రం తదితర అంశాల్లో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శిక్షణలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లా డుతూ గత కొన్ని సంవత్సరాలుగా మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సహకారంతో ఏటా బాలలకు ప్రత్యేకం గా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నాలుగు విభాగాల్లో 200 మంది బాలలు శిక్షణలు పొందా రన్నారు. ఇందులో భాగంగా శాస్త్రీయ గాత్ర సంగీతం, శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ పొందిన బాలలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా శిక్షణ పొందిన బాలలకు, శిక్షకులు నాగరాజు, పి.సుజాత, బి.వెంకటరమణలకు ప్రశం సా పత్రాలు అందజేశారు.

Updated Date - 2023-05-31T23:59:46+05:30 IST