జేఎన్టీయూ ఫుట్బాల్ జట్టుకు విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2023-11-01T23:11:53+05:30 IST
సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ పుట్బాల్ జెఎన్టీయూ జట్టుకు ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ఎండీ శివరాం తెలిపారు.
పాణ్యం, నవంబరు 1 : సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ పుట్బాల్ జెఎన్టీయూ జట్టుకు ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ఎండీ శివరాం తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అక్టోబరు 31న కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ జెఎన్టీయూ పుట్బాట్ జట్టు ఎంపిక పోటీలలో ఆర్జీఎం కళాశాలకు చెందిన వి. రాంజీ, శ్రీనాథ్రెడ్డి, శాంతిరాం కళాశాలకు చెందిన రాజశేఖర్ ఎంపికైనట్లు తెలిపారు. డిసెంబరు నెలలో కేరళలోని కేలికట్లో జరిగే యూనివర్శిటీ పోటీలలో విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఇందుకు కృషి చేసిన పీడీలు వెంకటేశ్, వెంకటేశ్వరనాయక్, చంద్రారెడ్డిలను ఆయన అభినందించారు. ప్రిన్సిపాల్స్ డాక్టర్ జయచంద్రప్రసాద్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, హెచ్ఓడీ వీరేశ్, సుధీర్కుమార్ పాల్గొన్నారు.