టీజీ వెంకటేశకు ‘సంపాద్ రత్న’ అవార్డు
ABN , First Publish Date - 2023-03-25T23:11:27+05:30 IST
మాజీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన టీజీ వెంకటేశ ఆదివారం ప్రతిష్టాత్మక ‘సంపాద్ రత్న’ అవార్డు అందుకున్నారు.
కర్నూలు(కల్చరల్), మార్చి 25: మాజీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన టీజీ వెంకటేశ ఆదివారం ప్రతిష్టాత్మక ‘సంపాద్ రత్న’ అవార్డు అందుకున్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన సంస్థ, ఈ సంసాద్ రత్న అవార్డును ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ప్రదేశ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందజేశారు. 2019 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం దాకా ఎంపీగా, పార్లమెంటరీ కమిటీ చైర్మనగా టీజీ వెంకటేశ అందించిన ఉత్తమ సేవలకుగాను టీజీ వెంకటేశను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.