స్పందన అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-09-26T01:05:54+05:30 IST
స్పందన అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్), సెప్టెంబరు 25: స్పందన అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్ రావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు.
కొన్ని వినతులు: సర్వే నెంబరు 394-1లో 20 సెంట్లు పట్టా భూమి ఉందని, పొరపాటున ఆన్లైన్లో అసైన్డ్ భూమిగా నమోదు చేశారని, అలా కాకుండా పట్టా భూమిగా మార్పించాలని జొన్నగిరి మండలం తుగ్గలి గ్రామ నివాసి ఆదినారాయణరెడ్డి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి గొందిపర్ల, పూలతోట గ్రామాలకు బస్ సర్వీసు నడుపుతున్నారని, అయితే ఇందిరమ్మ నగర్, సుందరయ్య నగర్లకు కూడా బస్సు సర్వీసులు నడపాలని కర్నూలు మండలం గొందిపర్ల గ్రామానికి చెందిన నాగరాజు, తిమ్మారెడ్డి, మోహిద్దీన్, రాముడు కోరారు.