ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి

ABN , First Publish Date - 2023-08-21T00:28:19+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ 79వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు.

ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి
రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు(అర్బన్‌) ఆగస్టు 20: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ 79వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు నివాళి అర్పించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఎం సుధాకర్‌బాబు మాట్లా డుతూ సాంకేతిక విప్లవ సారఽఽథి దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. రాజీవ్‌గాంధీ కంప్యూటర్‌, టెలికమ్యూనికేషన్లను దేశానికి పరిచయం చేశారని, రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుదాలను సమ కూర్చి దేశపూరోభివృద్దికి దోహదప డ్డారన్నారు. 1986లోనే న్యూ నేషనల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్‌ గాంధీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సత్యానారాయణ గుప్త, ఐన్‌టీయూసీ జిల్లాఅధ్యక్షుడు బీ.బ్రతుకన్న, బాబురావు, మైనార్టీ సెల్‌ సిటీ అధ్యక్షుడు షేక్‌ ఖాజా హుస్సేన్‌, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షు రాలు వెంకట సుజాత, రాధిక, లాజరస్‌ పాల్గొన్నారు.

కల్లూరు: సాంకేతిక విప్లవ సారఽథి దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అని నంద్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహయదవ్‌ అన్నారు. ఆదివారం నంద్యాల చెక్‌ఫోస్టు సమీపంలోని దామోదరం సంజీవ య్య భవన్‌, కల్లూరు కాలేజీ హాస్టల్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పఽథంలో ముందుకు నడిపించారని కొని యాడారు. కార్యక్రమంలో బాలస్వామి, పఠాన్‌హబీబ్‌, సాంభశివుడు, రహీం, అబ్రహం, నాగలింగం, రమణ, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-21T00:28:19+05:30 IST