అనారోగ్యంతోనే పులికూన మృతి..?
ABN , First Publish Date - 2023-06-01T00:07:56+05:30 IST
అనారోగ్యంతోనే పెద్దగుమ్మడాపురం పులి కూన మృతి చెందినట్టు తెలుస్తోంది
ఆత్మకూరు, మే 31: అనారోగ్యంతోనే పెద్దగుమ్మడాపురం పులి కూన మృతి చెందినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్కు గురై ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో మృతి చెందినట్లు తిరుపతి జూపార్క్ వైల్డ్లైఫ్ వెటర్నరీ డాక్టర్ అరుణ్కుమార్ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే నల్లమల నుంచి అనంతరం వీటిని ఒకే గదిలో బంధించడం వల్ల కూడా మృతికి కారణమై ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మరో మూడు రోజుల్లో రానున్న పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం తెలియనుంది. ఇదిలావుంటే మిగతా పూలి కూనలపై జూపార్కు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వాటికి సరైన ఆహారం అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు.