జీజీహెచ్లో పెథాలజీ ల్యాబ్ సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-10T23:52:39+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూ డయోగ్నస్టిక్ బ్లాక్లో మైక్రోబయాలజీ, పెథాలజీ ల్యాబ్ సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ వి.వెంకటరంగారెడ్డి తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 10: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూ డయోగ్నస్టిక్ బ్లాక్లో మైక్రోబయాలజీ, పెథాలజీ ల్యాబ్ సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ వి.వెంకటరంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలోని నూతన ల్యాబ్ ద్వారా రోగుల కు రక్తపరీక్షలు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో బయో కెమిస్ర్టీ, బ్లడ్ బ్యాంకు సేవలు కూడా అందుబాటులోకి తీసువస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో హేమనళిని, మైక్రోబయాలజి హెచ్వోడీ రేణుకాదేవి, పెథాలజీ హెచ్వోడీ ఆర్ఎంవో వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్స్ శివబాల నగాంజన్ పాల్గొన్నారు.