వైభవంగా పల్లకీ సేవ
ABN , First Publish Date - 2023-06-26T23:57:41+05:30 IST
మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో పల్లకీ సేవను సోమవారం వైభవంగా నిర్వహించారు.
బనగానపల్లె, జూన్ 26: మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో పల్లకీ సేవను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహేశ్వర శర్మ, ఇతర అర్చకుల ఆధ్వర్యంలోఈ వేడుకను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.