రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:31 AM
నగరంలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిశ్చంద్రప్ప (55) అనే వృద్ధుడు మృతి చెందాడు.
కర్నూలు, డిసెంబరు 13: నగరంలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిశ్చంద్రప్ప (55) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆస్పరి మండలం సిగిలి గ్రామా నికి చెందిన హరిశ్చంద్రప్ప కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఈ నెల 11న అమీలియో ఆసుపత్రికి వచ్చారు. ఆపరేషన్ ఇంకా చేయించు కోకముందు మంగళవారం రాత్రి బజ్జీల కోసం రోడ్డు దాటుతుండగా.. ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేసి జీవించే హరిశ్చంద్రప్ప భార్య గతంలో మృతి చెందింది. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.