‘మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలి’

ABN , First Publish Date - 2023-03-26T00:11:43+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో ఆలయ నాలుగు ద్వారాలలో ఒకటైన శివాజీ గోపురానికి జరపనున్న మహా కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.1008 చెన్న సిద్ధ రామ పండితారాధ్య శివాచార్య మహా స్వామీజీ అన్నారు.

‘మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలి’
సమావేశంలో మాట్లాడుతున్న పీఠాధిపతి

శ్రీశైలం, మార్చి 25: శ్రీశైల క్షేత్రంలో ఆలయ నాలుగు ద్వారాలలో ఒకటైన శివాజీ గోపురానికి జరపనున్న మహా కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.1008 చెన్న సిద్ధ రామ పండితారాధ్య శివాచార్య మహా స్వామీజీ అన్నారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠాధిపతి మాట్లాడుతూ క్షేత్రపరిధిలోని పంచమఠాల్లో కలశప్రతిష్ఠాపనలు, లింగప్రతిష్ఠాపనలు ఆలయ అధికారులు సంకల్పించారని అన్నారు. అలాగే ప్రతిష్ఠాపన క్రతువులు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించాలని ఉభయదేవాలయాల అర్చకులకు తెలిపారు. ఈవో ఎస్‌.లవన్న, ఎగ్జిక్యూటివ్‌ ఇంజ నీరు రామకృష్ణ, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు వీరన్నస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:11:43+05:30 IST