సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నాయకులు
ABN , First Publish Date - 2023-07-21T23:25:53+05:30 IST
మండలంలోని పిన్నాపురం వద్ద శుక్రవారం గ్రీనకో జలవిద్యుత ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో జార్ఖండ్ రాషా్ట్రనికి చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
పాణ్యం, జూలై 21: మండలంలోని పిన్నాపురం వద్ద శుక్రవారం గ్రీనకో జలవిద్యుత ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో జార్ఖండ్ రాషా్ట్రనికి చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సంఘటనా స్థలాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, టీడీపి పార్లమెంటరీ నాయకులు గౌరువెంకటరెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికలనమృతదేహాలను సందర్శించారు. అనంతరం ప్రమాద వివరాలను డీఎస్పీ మహేశ్వరరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద కార్మికులకు భద్రత కల్పించడంలో గ్రీనకో సంస్థ విఫలమైందన్నారు. కార్మికులకు సరైన రక్షణ లేకపోవడంతో పాటు 12 గంటలు పని చేయిస్త్తున్నారన్నారు. కార్మికులకు అందాల్సిన పీఎఫ్, ఈఎ్సఐ, బీమా వంటి సౌకర్యాలు కల్పించకుండా సంస్థ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ నాయకలు భాస్కర్, వెంకట్, సీపీఐ నాయకులు బాబాఫకృద్దీన డిమాండ్ చేశారు.