రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు..
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:50 AM
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించినందుకు ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా రని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
చంద్రబాబును దూరం చేసుకోవడమే కారణం
మరోసారి ఆ తప్పును చేయకండి..
రాష్ట్ర ప్రజలకు సోమిశెట్టి విజ్ఞప్తి
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 25: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించినందుకు ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా రని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగిస్తున్న అవినీతి, అప్రజాస్వామిక పద్ధతుల వల్ల రాష్ట్రం సమూలంగా నాశనమైందని అన్నా రు. నీతివంతమైన పాలన అందిం చిన చంద్రబాబును దూరం చేసుకు న్నందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొం టున్నామని రాష్ట్ర ప్రజలంతా బహిరంగంగానే చర్చించుకుంటు న్నారని అన్నారు. ఇటువంటి తప్పు మళ్లీ జరగకుండా ప్రజలు అప్ర మత్తంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపి, ముఖ్య మంత్రిగా చంద్రబాబును గెలిపిం చుకోవాలని అన్నారు.