Share News

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:11 AM

అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్క రించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జే మోహన్‌ అన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం

గూడూరు డిసెంబరు 23: అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్క రించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జే మోహన్‌ అన్నారు. శనివారం గూడూరులో అంగన్‌వాడీ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. గూడూరులో సచివాలయాల ఉద్యోగులు అంగన్‌వాడీ సెంటర్లను నిర్వహిస్తున్నారని తెలుసుకోని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సచివాలయాలను ముట్టడించి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, డివిజన్‌ కార్యదర్శి జె మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడటం తగదన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుంటప్ప, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు నాయకురాలు అరుణ, ఇందుమతి మద్దమ్మ, రాజేశ్వరి, మహేశ్వరి, మంజుల పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:11 AM