విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

ABN , First Publish Date - 2023-08-22T00:35:51+05:30 IST

రెండురోజుల నుంచి జూపాడుబంగ్లా ఎత్తిపోతల 1, 2 పథకాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు సోమవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

జూపాడుబంగ్లా, ఆగస్టు 21: రెండురోజుల నుంచి జూపాడుబంగ్లా ఎత్తిపోతల 1, 2 పథకాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు సోమవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్షాలులేక ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయని, మరోవైపు ఎత్తిపోతల ద్వారా నీళ్లు పెట్టుకుని పంటలు బతికించుకుందామనుకుంటే విద్యుత్‌ సరఫరా లేకుండా చేయడం తగదని అన్నారు. విద్యుత్‌ సరఫరా ఇచ్చే వరకు ఆందోళన విరమించేదీ లేదని ఏఈ రామాచారిని చుట్టూముట్టారు. లోడు ఎక్కువగా పడుతోందని పైనుంచి సరఫరా నిలిపేయమని చెప్పారని వివరణ ఇస్తుండగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నీరోజులు లేని లోడు ఇప్పుడే వచ్చిందా అంటూ నిలదీశారు.

పాములపాడు : కరెంటు కోతలు విధిస్తుండటంతో నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పాములపాడు, మిట్టకందాల, చెలిమిళ్ళ, కంబాలపల్లె తదితర గ్రామాల రైతులు సబ్‌స్టేషన్‌ అధికారులు, ఎడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Updated Date - 2023-08-22T00:35:51+05:30 IST