సమస్యల పరిష్కారంలో విఫలం

ABN , First Publish Date - 2023-01-18T00:34:58+05:30 IST

పేదల సమస్యలను పరిష్కరిం చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కే.జగన్నాథం అన్నారు.

సమస్యల పరిష్కారంలో విఫలం

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.జగన్నాథం

కర్నూలు(న్యూసిటీ), జనవరి 17: పేదల సమస్యలను పరిష్కరిం చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కే.జగన్నాథం అన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో సీపీఐ పోరుబాట పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే.జగన్నాథం మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1,80,000 నగదును ఐదు లక్షలకు పెం చాలని కోరారు. టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయా లన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు మనోమర్‌మాణిక్యం, నగర సహాయ కార్యదర్శి మహేష్‌, ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సోమన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:35:01+05:30 IST