మీ పథకాలు మాకొద్దు

ABN , First Publish Date - 2023-02-02T00:45:22+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పరాభావం తప్పడం లేదు.

 మీ పథకాలు మాకొద్దు

ఎమ్మెల్యే సాయితో బాధితులు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 1: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పరాభావం తప్పడం లేదు. ఇందులో భాగంగానే ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మండలంలోని నాగనాథనహళ్ళి గ్రామంలో బుధవా రం గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు భూమి చూపండి మీ పథ కాలు వద్దు అంటూ వృద్ధ దంపతులు ఎల్లమ్మ, రంగయ్య ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిని నిలదీశారు. ఆదోని మండిగిరి పంచాయతీలో తమకు పొలం ఉన్న ట్లు చూపిస్తున్నారని, ఆ భూమిని చూపించాలని ఆ వృద్ధ దంపతులు ఎమ్మె ల్యేను నిలదీశారు. వీఽధి లైట్లు లేవని, తాగు నీరు లేక కొనుక్కొని తాగుతున్నా మని బీసీ కాలనీకి చెందిన ఉచ్చ రంగ, నాగలక్ష్మి, వరలక్ష్మి వాపోయారు. ఇవేం పట్టించుకోని ఎమ్మెల్యే జగన్‌కు ఓటేయాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2023-02-02T00:45:25+05:30 IST