అహోబిలంలో హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2023-02-02T00:29:45+05:30 IST

దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని హుండీలను బుధవారం లెక్కించారు.

అహోబిలంలో హుండీ ఆదాయం లెక్కింపు
దిగువ అహోబిలంలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 1: దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని హుండీలను బుధవారం లెక్కించారు. మఠం అధికారులు సంపత్‌, శ్రీనివాసన్‌ బుధవారం మాట్లాడుతూ దిగువ అహోబిలంలోని హుండీలను లెక్కించగా రూ.42 లక్షలను భక్తులు సమర్పించుకున్నారని తెలిపారు. అలాగే పావన క్షేత్రంలో రూ.5 లక్షలు, చత్రవట, కారంజ, యోగానంద క్షేత్రాలలో రూ.3 లక్షల చొప్పున ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఎగువ అహోబిలంలో ఇప్పటి వరకు లెక్కించిన హుండీల ద్వారా రూ.80 లక్షలు ఆదాయం వచ్చిందని, బంగారు, వెండి వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

Updated Date - 2023-02-02T00:29:46+05:30 IST