విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డీఎంహెచ్వో
ABN , First Publish Date - 2023-05-31T23:58:03+05:30 IST
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సిబ్బందిని హెచ్చరించారు.
బనగానపల్లె, మే 31: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం మండలంలోని టంగుటూరు, పలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. టంగుటూరు వైద్యశాలలో సమాచారాన్ని డాక్టర్ శివశంకరుడును అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయాల పరిధిల్లో హెల్త్ సెంటర్లలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. టంగుటూరు ప్రాథమిక వైద్యశాలలో పూర్తి అయిన భవన నిర్మాణం, ల్యాబ్ రూం తదతర వాటిని ఆయన పరిశీలించారు. నిర్మాణం పూర్తి అయిందని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టంగుటూరులో ర్యాలీ నిర్వహించారు. పలుకూరులో తనిఖీలో భాగంగా మాతాశిశు సంరక్షణ సేవలను పకడ్బందీగా నిర్వహిచాలని డాక్టర్ శ్రీలక్ష్మిని ఆదేశించారు.